News November 7, 2024
మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో CID తనిఖీలు

మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్ధం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. బుధవారం తిరుపతి నుంచి వచ్చిన CID DSP బృందం సభ్యులు మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈసీ, నకళ్లు, రికార్డులు తనిఖీచేసి రాజకీయ నేతల వద్ద ఉండకూడని రికార్డులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎలా వెళ్లాయో తెలుసుకున్నారు. కేసు సీఐడీకి బదిలీ కావడంతో అధికారులు భిన్నకోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 24, 2026
చిత్తూరు- తిరుపతి హైవేపై ప్రమాదం

పూతలపట్టు మండలం వడ్డేపల్లి వద్ద ఓ వ్యక్తిని టెంపో వాహనం ఢీకొట్టింది. స్థానిక బిడారమిట్టకు చెందిన టి చెంగయ్య వడ్డేపల్లి వద్ద ఓ కళ్యాణమండపంలో జరుగుతున్న తమ సమీప బంధువు వివాహానికి హాజరు కావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో వాహనం చెంగయ్యను ఢీకొని రెండు కాళ్లపై మీదుగా వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2026
సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.
News February 24, 2026
సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.


