News November 7, 2024

మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో CID తనిఖీలు

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్ధం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. బుధవారం తిరుపతి నుంచి వచ్చిన CID DSP బృందం సభ్యులు మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈసీ, నకళ్లు, రికార్డులు తనిఖీచేసి రాజకీయ నేతల వద్ద ఉండకూడని రికార్డులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎలా వెళ్లాయో తెలుసుకున్నారు. కేసు సీఐడీకి బదిలీ కావడంతో అధికారులు భిన్నకోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 12, 2025

నేడు జిల్లా వ్యాప్తంగా 10,168 గృహ ప్రవేశాలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 10,168 గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మరోవైపు PMAY 2.O క్రింద 2,472 ఇళ్లులు మంజూరు కాగా వాటి లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1లక్షను అందించనుంది.

News November 11, 2025

మౌలానాకు నివాళులు అర్పించిన ఎస్పీ

image

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం నివాళులు అర్పించారు. దేశ తొలి విద్యామంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నిరక్షరాస్యత పేదరికం రూపుమాపడానికి అనేక సేవలు చేశారని వెల్లడించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు.

News November 11, 2025

పూతలపట్టు: అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా

image

పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గల జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఐచర్ వాహనం అతివేగంగా వెళ్లి బోల్తా పడింది. ఇందులో ఉన్న దానిమ్మ కాయలు కోసం ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి.