News December 1, 2024
మదనపల్లె MLAపై మంత్రి లోకేశ్కు ఫిర్యాదు చేసిన MRO

మదనపల్లె MLA షాజహాన్ బాషా తనను బెదిరిస్తున్నారంటూ MRO ఖాజాబీ మంత్రి లోకేశ్కు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలంటూ ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆమె మంత్రి వద్ద వాపోయారు. తన విధుల విషయంలో జోక్యం చేసుకుని బెదిరిస్తున్నాడరన్నారు. తనకు ఎమ్మెల్యే నుంచి ఎలాంటి ఒత్తిడులు లేకుండా విధులు నిర్వర్తించేలా చూడాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
Similar News
News March 7, 2026
మృత్యుంజయ స్వామిని దర్శించుకున్న జడ్జి అరుణ

చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక శనివారం చౌడేపల్లి మండలంలోని పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత స్థానిక శివాలయంలో మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. శివాలయంలో అర్చకులు, బోయకొండలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం న్యాయమూర్తిని సాదరంగా ఆహ్వానించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు.
News March 7, 2026
లింగ నిర్ధారణ చట్టం పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం పక్కగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లె కలెక్టరేట్లోని కోర్టు హాల్లో లింగ నిర్ధారణ నిషేధ చట్టం, ప్రసూతి మరణాలపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. లింగ నిర్ధారణ, అబార్షన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై విస్తృత అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
News March 7, 2026
చిత్తూరు: కార్పొరేట్ ఉచిత విద్యకు 10 వరకే గడువు

విద్యాహక్కు చట్టం ప్రకారం పేద, మధ్యతరగతి వర్గాల వారు ఉచితంగా కార్పొరేట్ విద్య అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఇందుకోసం విద్యాసంస్థలు 25% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రవేశానికి తగిన సర్టిఫికేట్లతో సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు మార్చి 10 వరకు మాత్రమే ఉంది. లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు.


