News April 4, 2024

మద్దికేర రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి

image

మద్దికేర గ్రామ శివారులో ఇటీవల బొలెరో టైరు పగిలి విద్యుత్ స్తంభానికి ఢీకొని బోల్తాపడిన ఘటన తెలిసిందే. అందులో ప్రయాణిస్తున్న మద్దికేర గ్రామానికి చెందిన కూలీలు ఆదిలక్ష్మి (50), సంజమ్మ (40) అదే రోజు మరణించారు. కురువ లక్ష్మీదేవి (35) సావిత్రమ్మ(65) చికిత్స పొందుతూ బుధవార రాత్రి మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Similar News

News December 22, 2025

ఫిర్యాదులపై చట్టపర చర్యలు: కర్నలు SP

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. మోసాలు, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, దాడులు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.

News December 22, 2025

కర్నూలు: విద్యుత్ సమస్యల పరిష్కారంపై అవగాహణ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు APSPDCL ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం గ్రామాలు, పట్టణ వార్డుల్లో విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ SE ప్రదీప్ కుమార్ ఉన్నారు.

News December 22, 2025

సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి: కర్నూలు కలెక్టర్

image

ప్రజల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ న్యూరల్ కామర్‌తో కలిసి పీజీఆర్ఎస్ ద్వారా వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతి సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల విభాగం (పీజీఆర్ఎస్) జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.