News March 20, 2024
మద్దిపాడు: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఎలుకల మందు తిని ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మద్దిపాడులోని బీసీ కాలనీకి చెందిన అన్నపరెడ్డి వెంకటలక్ష్మి(26) ఏడాదికాలంగా మానసికంగా ఆందోళన చెందుతుంది. ఈ క్రమంలో ఈనెల 17న ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలు రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 7, 2026
ప్రకాశం: మోసంచేసి రన్నింగ్ బస్ దూకి మృతి

టంగుటూరుకు చెందిన మురళి చిలకలూరిపేట నుంచి ఒంగోలుకు RTC బస్సులో వస్తున్నాడు. జాగర్లమూడివారిపాలెంకి చెందిన గోపీనాథ్(24) అదే బస్సులో మేదరమెట్ల వద్ద ఎక్కాడు. తనకు రూ.200 ఫోన్పే చేయాలని మురళిని అడిగి కొడుతుండగా పాస్వర్డ్ గుర్తుపెట్టుకున్నాడు గోపీ. మరోసారి మురళిని ఫోన్ అడిగి రూ.90వేలు ట్రాన్ఫర్ చేసుకున్నాడు. మురళి గమనించి అడగగా గోపీ రన్నింగ్ బస్ నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కాగా మంగళవారం చనిపోయాడు.
News January 7, 2026
మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.
News January 7, 2026
మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.


