News March 20, 2024

మద్దిపాడు: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

ఎలుకల మందు తిని ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మద్దిపాడులోని బీసీ కాలనీకి చెందిన అన్నపరెడ్డి వెంకటలక్ష్మి(26) ఏడాదికాలంగా మానసికంగా ఆందోళన చెందుతుంది. ఈ క్రమంలో ఈనెల 17న ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలు రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News July 9, 2025

ప్రకాశం జిల్లాలోని ఈ పాఠశాల్లో ఒక్కరు కూడా చేరలేదు.!

image

అత్యధికంగా HMపాడులో 10, కొమరులులో 8, CS పురంలో, కనిగిరి, రాచర్ల మండలాల్లో 5 స్కూళ్లల్లో అడ్మిషన్లు నమోదు కాలేదు. బీపేట, దర్శి, దొనకొండ, మద్దిపాడు, నాగులుప్పలపాడు, పొదిలి, సింగరాయకొండ, త్రిపురాంతంకంలో ఒక్కో స్కూల్లో ఎవరూ చేరలేదు. ఒంగోలు, టంగుటూరు మండలాల్లో 3, చీమకుర్తి, కొండపి, కురిచేడులో రెండేసి సూళ్లల్లో అడ్మిషన్లు లేవు.

News July 9, 2025

ఒంగోలు: 17 నెలల చిన్నారికి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌

image

ఒంగోలులోని సత్యనారాయపురానికి చెందిన చిన్నారి అంబటి ఖశ్విని ఎస్పీ దామోదర్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. 17 నెలల వయస్సులోనే ఖశ్వి 24 వేర్వేరు కేటగిరీల్లో 650కి పైగా ఇంగ్లిష్ పదాలను మాట్లాడడంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. దీంతో చిన్న వయస్సులోనే అద్భుత రికార్డ్ సృష్టించిన చిన్నారిని, తల్లిదండ్రులను ప్రశంసించారు.

News July 9, 2025

బీఎల్ఓల భాద్యతే కీలకం: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో బీఎల్ఓల భాద్యతలు కీలకమని ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మంగళవారం బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భాద్యతలు నిర్వర్తించాలన్నారు.