News April 16, 2025

మద్దూరులో మంత్రి పర్యటన.. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్

image

భూభారతి పోర్టల్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలం ఖాజీపూర్‌లో గురువారం నిర్వహించే రెవెన్యూ సదస్సుకు హాజరవుతున్న రెవెన్యూ, సమాచార పౌరా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈరోజు పర్యవేక్షించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 18, 2025

జగిత్యాల: KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

image

రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన మహిళా అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 వయసు గలవారు అర్హులన్నారు. ఈనెల 19లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. SHARE IT.

News November 18, 2025

జగిత్యాల: KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

image

రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన మహిళా అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 వయసు గలవారు అర్హులన్నారు. ఈనెల 19లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. SHARE IT.

News November 18, 2025

HYD: మిద్దె తోటలతో ఎన్నో ప్రయోజనాలు

image

HYDలో మిద్దె తోటల పెంపకం జోరందుకుంది. ఈ పద్ధతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నేచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. మరోవైపు భవన ఉష్ణోగ్రతలు తగ్గతుందని పేర్కొన్నారు. నీటి ఉపయోగం పెద్దగా లేకుండా ఈజీగా ఫ్రెష్‌గా వండుకోవచ్చని డా.విష్ణు వందన తెలిపారు. ఉద్యానశాఖ నెలలో రెండో శనివారంలో ఒక్కోచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.