News April 25, 2024
మద్దూరు: 35 కోట్ల ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణించారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీ పథకాలలో భాగంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడబిడ్డలు లబ్ధి పొందాలని, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. 6 గ్యారంటీ పథకాలలో ఐదు గ్యారంటీ పథకాలు 100 రోజుల్లోనే పూర్తి చేశామని అన్నారు.
Similar News
News December 11, 2025
మహబూబ్నగర్ గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. గండీడ్, రాజాపూర్, మహమ్మదాబాద్, నవాబ్పేట, మహబూబ్నగర్ రూరల్ మండలాల్లోని 139 పంచాయతీల్లో అభ్యర్థుల భవిత్యం తేలనుంది. ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉ. 7 నుంచి మ. 1గంట వరకు జరగనుండగా.. మ. 2గంటల నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటేసేందుకు రెడీనా?
News December 10, 2025
MBNR: పల్లె బాట పట్టిన పట్టణవాసులు

మహబూబ్నగర్ జిల్లాలో రేపు గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు, ముంబై వలస వెళ్లిన కార్మికులు తిరిగి తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులలో రద్దీ గణనీయంగా పెరిగింది. కొందరు సొంత వాహనాలతో తమ గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో 44వ జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
News December 10, 2025
నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

నిష్పక్షపాతంగా ప్రతి అధికారి విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి బుధవారం సూచించారు. రేపు మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని, ఎల్లప్పుడూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ ఉండాలని సూచించారు.


