News January 25, 2025
మద్నూరు: జొన్న రొట్టెతో ఎన్నికల సంఘం చిహ్నాలు…!

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వినూత్నంగా చిత్రం గీశాడు. జొన్న రొట్టెతో ఎన్నికల సంఘం చిహ్నాలు తయారు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్రం ద్వారా కోరారు. దీన్ని చూసిన పలువురు బాల్ కిషన్ను అభినందించారు.
Similar News
News December 6, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
∆} నేడు ఖమ్మం, మధిర, చింతకాని మండలాల్లో పవర్ కట్
∆} నేడు ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ
∆} నేడు ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
News December 6, 2025
సత్తుపల్లి: అక్రమ వేట.. మాజీ MLA సోదరుడి కుమారుడి అరెస్టు

సత్తుపల్లిలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వేట కార్యకలాపాలపై టాస్క్ఫోర్స్, అటవీ శాఖ సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించి నలుగురిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు రఘు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం పట్టుబడిన రఘు, మరో నిందితుడు కుంజా భరత్లను కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు ఉంటాయని DFO హెచ్చరించారు.
News December 6, 2025
NLG: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.9,600

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు ఉద్యాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. కూరగాయల సాగు విస్తరణకు ఎకరానికి రూ.9,600, హెక్టారుకు రూ.24,000 వేల చొప్పున ప్రభుత్వం రాయితీ అందించనుంది. రాష్ట్రంలో 10 వేల ఎకరాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 350 ఎకరాలకు సాగును విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానికంగా సాగు పెరిగితే రైతులకు లాభం, ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు అందుతాయని అధికారులు సూచిస్తున్నారు.


