News December 20, 2024

మద్నూర్: యాసంగి పంటలకు జింకల బెడద 

image

మద్నూర్ మండలంలో యాసంగి పంటలకు జింకల బెడద ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జొన్న, శనగ, మినుము, మొక్కజొన్న సాగు పంట భూములలో పెద్ద సంఖ్యలో జింకలు వచ్చి పంటను నష్ట పరుస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలోను జింకల కారణంగా పంటలను నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు జింకలు బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.

Similar News

News December 10, 2025

NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.

News December 10, 2025

NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

image

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్​కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

News December 10, 2025

NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

image

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్​కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.