News July 31, 2024
మద్నూర్: రూ. వెయ్యి కోసం వ్యక్తి హత్య
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో రూ. వెయ్యి కోసం ఓ వ్యక్తిని హత్య చేశారు. సీఐ నరేశ్ ప్రకారం.. మోఘ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గొండా ఈనెల 20న రుణమాఫీ డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సాయిలు.. లక్ష్మణ్ వద్ద రూ. వెయ్యి లాక్కున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో సలాబత్ పూర్ బ్రిడ్జి వద్ద లక్ష్మణ్ను.. సాయిలు బండరాయితో మోది హత్య చేశాడు.
Similar News
News February 7, 2025
కోటగిరి: తల్లి, తనయుడు అదృశ్యం
కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన బండారి జ్యోతి(24) తన ఒకటిన్నర సంవత్సరాల కొడుకుతో అదృశ్యమైనట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బిడ్డతోపాటు వెళ్లిపోయింది. జ్యోతికి మాటలు రావని ఆచూకీ తెలిసినవారు కోటగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News February 7, 2025
NZB: చోరీకి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్
బైకు చోరీకి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సీఐ మల్లేష్, జక్రాన్పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన సాయన్న బైక్ ఈనెల 5వ తేదీన చోరీకి గురైంది. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మనోహరాబాద్లో రాకేశ్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బైకును రికవరీ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.
News February 7, 2025
NZB: CPకి MIM నాయకుల వినతి
రంజాన్ నేపథ్యంలో అర్ధరాత్రి దుకాణాలు తెరవడానికి అనుమతించాలని కోరుతూ MIMనాయకులు గురువారం నిజామాబాద్ ఇన్ఛార్జి CP సింధూశర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో షబ్-ఎ-బరాత్, రంజాన్ మాసం సందర్భంగా అహ్మదీ బజార్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఖిల్లా రోడ్, బోధన్ చౌక్ ప్రాంతాల్లో అర్ధరాత్రి దుకాణాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు.