News February 24, 2025
మద్యం దుకాణాలు 48 గంటలపాటు బంద్: కలెక్టర్

ఈ నెల 27వ తేదీన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కారణంగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను 48 గంటలు మూసివేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఛీప్ ఎలక్టోరల్ అధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 25 సాయంత్రం 4.00 గంటల నుంచి 27 సాయంత్రం 4.00 గంటల వరకు డ్రై డేగా ఉంటుందని, దీనికి అందరూ సహకరించాలన్నారు.
Similar News
News January 6, 2026
కరప: తల్లి మందలించిందని మనస్తాపం.. బాలుడి ఆత్మహత్య

తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పలంక మొండి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సునీత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో నివసించే సంగాని సూరిబాబు ఫ్యామిలీతో ఇటీవలే గ్రామానికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా తనను మందలించిందని మనస్తాపానికి గురైన కుమారుడు సింహాద్రి(16) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.
News January 6, 2026
KNR: AIFB పార్టీ వైపు ఆశావహుల చూపు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, BJP, BRS పార్టీలలో కాంపిటీషన్ ఉండటంతో ఆశావహులు AIFB పార్టీ టికెట్ పై పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆపార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి AIFBలో సభ్యత్వం ఉన్న వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు. ఉమ్మడి KNRలో AIFB నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం MLAగా కోరుకంటి చందర్ గెలవగా, గత మున్సిపల్ ఎన్నికల్లో RGMలో 11, KNRలో 3 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది.
News January 6, 2026
కుంకుమ పువ్వు, కూరగాయలతో ఏటా రూ.24 లక్షల ఆదాయం

అధునాతన వ్యవసాయ పద్ధతుల్లో హై క్వాలిటీ కశ్మీరీ కుంకుమ పువ్వును సాగు చేస్తూ రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు ఒడిశాకు చెందిన సుజాతా అగర్వాల్. తన ఇంట్లోనే 100 చ.అడుగుల గదిలో మూడేళ్లుగా ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వును, హైడ్రోపోనిక్స్ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్ సాగు చేసి విక్రయిస్తూ ఏటా రూ.24 లక్షల ఆదాయం పొందుతున్నారు. సుజాతా సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


