News February 24, 2025
మద్యం దుకాణాలు 48 గంటలపాటు బంద్: కలెక్టర్

ఈ నెల 27వ తేదీన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కారణంగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను 48 గంటలు మూసివేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఛీప్ ఎలక్టోరల్ అధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 25 సాయంత్రం 4.00 గంటల నుంచి 27 సాయంత్రం 4.00 గంటల వరకు డ్రై డేగా ఉంటుందని, దీనికి అందరూ సహకరించాలన్నారు.
Similar News
News October 26, 2025
రామాయంపేట: GREAT.. 56వ సారి రక్తదానం

రామాయంపేట పట్టణానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56వ సారి రక్తదానం చేశారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 56వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఎస్పీ అభినందించారు.
News October 26, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 26, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 26, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.59 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.12 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.48 గంటలకు
✒ ఇష: రాత్రి 7.01 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు


