News March 6, 2025
మద్యం మత్తులో పురుగుమందు తాగి వ్యక్తి మృతి

పురుగుమందు తాగి ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని చైన్ పాక గ్రామంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్ది కిష్టస్వామి(60) తరచూ మద్యం తాగుతూ భార్యతో గొడవ పడుతుండేవాడు.ఈ క్రమంలో భార్య మద్యం తాగితే ఇల్లు ఎలా గడవాలి అని అడిగింది. దీంతో మద్యం మత్తులో పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు దవాఖానాకి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సైతం ఈ వివరాలు పంపింది.


