News March 6, 2025
మద్యం మత్తులో పురుగుమందు తాగి వ్యక్తి మృతి

పురుగుమందు తాగి ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని చైన్ పాక గ్రామంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్ది కిష్టస్వామి(60) తరచూ మద్యం తాగుతూ భార్యతో గొడవ పడుతుండేవాడు.ఈ క్రమంలో భార్య మద్యం తాగితే ఇల్లు ఎలా గడవాలి అని అడిగింది. దీంతో మద్యం మత్తులో పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు దవాఖానాకి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News December 9, 2025
PHC స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను PHC స్థాయిలోనే సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,566 స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు నమోదైనట్లు చెప్పారు. 9 మరణాలూ అనుమానిత కేసులు మాత్రమే అని, లోతైన పరీక్షలకు జీనోమ్ సీక్వెన్స్ చేయిస్తున్నామన్నారు. కుట్టినట్లు అనిపించిన శరీర భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు.
News December 9, 2025
‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్ సంజీవ్లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.
News December 9, 2025
GNT: నేడు డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ప్రారంభం

మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం రాష్ట్రంలోని డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళగిరి ఏపీఐఐసీ 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలను ఉదయం 10.30 గంటలకు మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ప్రభుత్వం అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు చేస్తుందని అన్నారు.


