News May 12, 2024

మద్యం విక్రయాలు జరిగితే ఫిర్యాదు చేయండి

image

లోకసభ ఎన్నికల దృష్ట్యా శనివారం సాయంత్రం నుండి మద్యం దుకాణాలు కల్లు కాంపౌండ్లు సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ నాగిరెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి వరకు మూసి ఉంటాయి. ఈ సమయంలో ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే సమాచారం ఇవ్వాలని సూచించారు. డిటిఎఫ్ – 87126 58840, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ – 87126 58841 వైరా 87126 58844, మధిర 87126 58845, సత్తుపల్లి 87126 58847/ సింగరేణి 87126 58848 సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News February 16, 2025

మన ఖమ్మం విత్తనాలు రాష్ట్రాలు చుట్టేస్తున్నాయ్..!

image

సాగులో మందుల వినియోగం తగ్గించేందుకు నాణ్యమైన ఉత్పత్తితో 400 రకాల విత్తనాలను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌కు చెందిన రైతు మన్నేపల్లి రవి. సాగుపై ఇష్టంతో ఇంజినీరింగ్ చదివిన కుమారుడు హర్షతో కలిసి తన పొలంతో పాటు 300 ఎకరాలను కౌలుకు తీసుకొని విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. పురుగు మందుల వినియోగం అవసరం లేని విత్తనాలను ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని వారు అంటున్నారు.

News February 16, 2025

నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

image

ఖమ్మం జిల్లాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి కూసుమంచి, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, మధిర, ఖమ్మం, ముదిగొండ మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు.

News February 16, 2025

కల్వకుంట్ల కవితను కలిసిన ఖమ్మం బీఆర్ఎస్ నేతలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఖమ్మంకు వచ్చిన ఎమ్మెల్సీని జిల్లా బీఆర్ఎస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని వారికి కవిత పలు సూచనలు చేశారు.

error: Content is protected !!