News April 13, 2025

మద్యం సేవించి వాహనం నడపడం నేరం: సీపీ వరంగల్

image

మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, చర్యలు తప్పవని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ మద్యం సేవించిన వాహనదారుల వలన కలిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత నెల రోజుల్లో జరిపిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీల్లో మొత్తం 3029 కేసులు నమోదయ్యాయన్నారు.  

Similar News

News November 24, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో ఇల్లు రీసర్వే, తల్లికి వందనం, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు తదితరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News November 24, 2025

KMM: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

image

ఖమ్మం జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

News November 24, 2025

అంతర్ జిల్లాల అండర్-17 ఖోఖో విజేత ప్రకాశం జిల్లా

image

కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్-17 ఖోఖో ఛాంపియన్‌షిప్ పోటీలు సోమవారంతో ముగిశాయి. విజేతలకు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరై బహుమతి ప్రదానం చేశారు. ఈ టోర్నీలో ప్రకాశం జిల్లా విన్నర్‌గా, చిత్తూరు జిల్లా రన్నరప్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా ఖోఖో క్రీడల ద్వారా ఉద్యోగాలు పొందిన క్రీడాకారులను సత్కరించారు. పీఈటీలు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.