News August 6, 2024
మధిర: గల్లంతైన మృతదేహం లభ్యం

మధిర రైల్వే బ్రిడ్జి సమీపంలోని వైరా నదిలో నిన్న అద్దంకి రవీంద్రా అనే యువకుడు ఈతకు వెళ్లి <<13783729>>గల్లంతైన <<>>విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం లభ్యం కాలేదు. కాగా, ఈరోజు ఉదయం గాలింపు చర్యలను మొదలుపెట్టిన పోలీసు అధికారులు ఎట్టకేలకు మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. రవీంద్ర మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Similar News
News October 28, 2025
ఖమ్మం: కార్తీకమాసం.. అరుణాచలంకు ప్రత్యేక బస్సు

కార్తీకమాసం సందర్భంగా ఖమ్మం కొత్తబస్టాండ్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం సరీరాం తెలిపారు. నవంబర్ 3న రాత్రి 7గంటలకు బస్సు బయలుదేరి 4వ తేదీ కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5000, పిల్లలకు రూ.2530గా నిర్ణయించారు. వివరాలకు 91364 46666, 99592 25979, 99592 25965లను సంప్రదించవచ్చని కోరారు.
News October 28, 2025
మొంథా తుపాను.. అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం కలెక్టర్

మొంథా తుపాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. రానున్న 2, 3 రోజుల పాటు రైతులు పంట కోతలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా కోతలను తాత్కాలికంగా వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పంటలను రక్షించే చర్యలు తీసుకోవాలని రైతులకు సూచిస్తూ కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ఫలించిన తుమ్మల కృషి.. ఖమ్మంకు రూ.200 కోట్లు

ఖమ్మం నగరానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో రూపొందిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాది పొడవునా మున్నేరు, పాలేరుల నుంచి నీటి సరఫరా జరగనుంది. పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఆధునిక పైపులైన్, ఫిల్టర్ బెడ్ వ్యవస్థలు ఏర్పాటవనున్నాయి. ఖమ్మం నగర అభివృద్ధికి ఇది మైలు రాయి అని నగర ప్రజలు మంత్రి తుమ్మల కృషిని ప్రశంసిస్తున్నారు.


