News November 20, 2024

మధిర: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వైరా ఏసీపీ

image

మధిర రూరల్ మండలంలోని అమరావతి కాటన్‌ జన్నింగ్ మిల్లు, మంజిత్ కాటన్‌ జన్నింగ్ మిల్లు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని, మధిర మండలం ఇల్లురూ గ్రామంలోని వైరా ఏసీపీ రహెమాన్ సందర్శించారు. దాన్యం, పత్తి కొనుగోలు పలు అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు.

Similar News

News November 2, 2025

ఖమ్మం: ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్

image

పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న సూపర్ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జీ జి.రాజగోపాల్ తెలిపారు. ఖమ్మం జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద బీమా కేసులు, రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.

News November 1, 2025

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

image

వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. పెద్దచెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.

News November 1, 2025

కంప్యూటర్ల మరమ్మతుకు టెండర్లు దాఖలు చేయాలి: అ.కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని 84 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్స్ మరమ్మతులకు NOV 6 లోపు టెండర్లు దాఖలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. కంప్యూటర్ మరమ్మతుల నిమిత్తం 69 ఉన్నత పాఠశాలలకు రూ.15 వేలు చొప్పున, 15 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.11.10 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఆసక్తి గల వారు DEO కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.