News June 12, 2024
మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో రాజీపడొద్దు: కలెక్టర్

పాఠశాలలు పున:ప్రారంభం నుంచి లంచ్ అండ్ లెర్న్ బుధవారం కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందని తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో సమావేశ మందిరంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
Similar News
News October 16, 2025
మంత్రి పొన్నం ప్రభాకర్పై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

మంత్రి పొన్నం ప్రభాకర్పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చనిపోయారని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్కు చెందిన గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News October 16, 2025
KNR: 30లక్షల క్వింటాళ్ల వరిధాన్యం సేకరణే లక్ష్యం

ఖరీఫ్ 2025-26 సీజన్లో జిల్లా వ్యాప్తంగా 325 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ నర్సింగరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఏజెన్సీల ద్వారా ఈసారి సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నర్సింగరావు చెప్పారు.
News October 16, 2025
KNR: సానుభూతితో కాదు.. పట్టుదల, ప్రతిభతో విజయం సాధించాలి

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలికలు సానుభూతితో కాకుండా పట్టుదల, నైపుణ్యంతో విజయం సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. కష్టపడి చదివితేనే విజయం సాధించవచ్చన్నారు. బాలికలు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించి ధైర్యంగా ముందడుగు వేయాలని కలెక్టర్ కోరారు.