News February 7, 2025

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

image

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదినేపల్లి(M) విశ్వనాద్రిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దయాసాగర్, సింధూర(20)కు ఆర్నెళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా సింధూరకు పిల్లలు పుట్టరని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పద్మజ తెలిపారు.

Similar News

News December 24, 2025

కర్నూలు SP కీలక నిర్ణయం

image

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

News December 24, 2025

మహిళలపై ఇన్ఫ్లమేషన్ ప్రభావం

image

ఇన్‌ఫ్లమేషన్ అంటే సాధారణ భాషలో వాపు అని అర్థం. క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, ఆర్థరైటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి అనేక వ్యాధులకు ఇది కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల్లో జననాంగ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఫైబ్రాయిడ్లు, జీర్ణ సమస్యలు, చర్మసమస్యలు వంటివి వస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గాలంటే స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 24, 2025

KNR: “వినియోగదారుడా మేలుకో”.. అడగటం నీ హక్కు

image

నేటి మార్కెట్ వ్యవస్థలో వినియోగదారుడే రాజు అని అంటారు. కానీ, ఆచరణలో మాత్రం తూకాల్లో తేడాలు, నాణ్యత లేని వస్తువులు, తప్పుడు ప్రకటనలతో వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై అవగాహన లేకపోవడం, “ఎవరు పోరాడుతారులే” అనే నిర్లక్ష్యం వ్యాపారులకు వరంగా మారుతోంది. కరీంనగర్ జిల్లాలో వినియోగదారుల కోర్టు ఉన్నా దాని వినియోగం చాలా అంటే చాలా తక్కువ. నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం.