News February 7, 2025
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదినేపల్లి(M) విశ్వనాద్రిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దయాసాగర్, సింధూర(20)కు ఆర్నెళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా సింధూరకు పిల్లలు పుట్టరని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పద్మజ తెలిపారు.
Similar News
News February 12, 2026
‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300కోట్లు?

సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ‘RRR’ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ (రూ.1,200 కోట్లు) కంటే ఎక్కువ అని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు అంతర్జాతీయ మీడియా ‘వెరైటీ’ సైతం వారణాసి బడ్జెట్ దాదాపు రూ.1,300 కోట్లు($150M) అని పేర్కొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలవనుంది.
News February 12, 2026
అన్నమయ్య: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.
News February 12, 2026
నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖంచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.


