News December 19, 2024

మనిషికి 55‌ లీటర్లు నీటిని ఇచ్చేలా కార్యాచరణ: పవన్

image

విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి తాగు నీరు అందిస్తామన్నారు. కుళాయి ద్వారా నాణ్యమైన ‌మంచి నీరు అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. ఒక మనిషికి 55‌ లీటర్ల నీటిని అందించే కార్యాచరణ రూపొందించామన్నారు.

Similar News

News January 22, 2025

ప్ర‌కృతి వ్య‌వ‌సాయం దిశ‌గా ముందడుగు వేయాలి: కలెక్టర్

image

సాగులో పెట్టుబ‌డి వ్య‌యం త‌గ్గించి, ఆదాయం పెంచే ల‌క్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంతో రైతుల‌ను చేయిప‌ట్టి న‌డిపిస్తోందని క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ సూచించారు. బుధ‌వారం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, దాములూరులో నిర్వ‌హించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం ఎలా ఉంది.? సాగుచేస్తున్న పంట‌లు గురించి అడిగి తెలుసుకున్నారు. 

News January 22, 2025

దుర్గగుడి ప్రధానార్చకులు మృతి

image

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గగుడిలో చాలా సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న ప్రధానార్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మరణించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య రీత్యా మరణించినట్లు సమాచారం.

News January 22, 2025

జి.కొండూరు: ప్రేయసి వెళ్లిపోయిందని సూసైడ్

image

ఇద్దరు పిల్లలున్న ప్రేయసి కాదన్నదని జి.కొండూరులోని చెర్వుమాధవరానికి చెందిన ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆటోడ్రైవర్ బాలాజీ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మృతుడు మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఇకపై కలవడం కుదరదని వెళ్లిపోయింది. మనస్తాపంతో ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో మైలవరం సీఐ దర్యాప్తు చేపట్టామన్నారు.