News July 28, 2024

మనుబోలులో వ్యక్తిపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం

image

మనుబోలు గ్రామానికి చెందిన మొలకల శశిధర రెడ్డిపై గూడూరు మండలం వెందోడు గ్రామానికి చెందిన మద్దాలి హర్ష వర్ధన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో శశి ధరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News October 22, 2025

కరేడు పరిశ్రమల హబ్‌ భూసేకరణ వేగవంతం: కలెక్టర్

image

ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో పరిశ్రమల హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేస్తోంది. మొత్తం 4,800ల ఎకరాల్లో ఇప్పటి వరకు 672.279 ఎకరాలకు భూవార్డులు పాస్ అయ్యాయి. రైతులు ప్రభుత్వానికి సహకరించినందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు వేలాది ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు జిల్లాకి ఆర్థిక బలం ఏర్పడనుందన్నారు.

News October 22, 2025

కరేడులో 672 ఎకరాల భూసేకరణ పూర్తి: కలెక్టర్

image

ఉలవపాడు(M) కరేడులో తాజాగా 80 ఎకరాల భూ సేకరణకు అవార్డ్ పాస్ చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం తెలిపారు. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం కరేడులో 4,800 ఎకరాల భూ సేకరణ లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 672 ఎకరాలకు పరిహారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో కరేడు రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 22, 2025

గుడ్లురులో ప్రమందం.. 50కి పైగా గొర్రెలు మృతి

image

గుడ్లూరు మండలంలో మంగళవారం రాత్రి నేషనల్ హైవే‌పై దారుణం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కంటైనర్ వాహనం గొర్రెల మందను ఢీ కొట్టడంతో 50కి పైగా గొర్రెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. మోచర్ల – వీరేపల్లి గ్రామాల మధ్య గొర్రెల మందను నేషనల్ హైవేపై క్రాస్ చేయిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. కేసు నమోదు చేయనున్నట్లు గుడ్లూరు పోలీసులు తెలిపారు.