News July 28, 2024
మనుబోలులో వ్యక్తిపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం

మనుబోలు గ్రామానికి చెందిన మొలకల శశిధర రెడ్డిపై గూడూరు మండలం వెందోడు గ్రామానికి చెందిన మద్దాలి హర్ష వర్ధన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో శశి ధరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
నెల్లూరు: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.23 లక్షల స్వాహా

నెల్లూరు రూరల్లోని శాస్త్రవేత్తకు సైబర్ నేరగాళ్ల సెగ తగిలింది. CBI పేరుతో డిజిటల్ అరెస్టుకు పాల్పడి అతని వద్ద నుంచి రూ.23 లక్షలు స్వాహా చేశారు. మహిళలకు అసభ్యకరమైన ఫొటోలు పంపించినందుకు తాము అరెస్టు చేస్తున్నట్లు బెంగళూరు నుంచి CBI అధికారుల పేరుతో కాల్ చేసి భయపెట్టారు. బాధితుడు రూ.23 లక్షలు చెల్లించి మోసపోవడంతో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 22, 2025
నెల్లూరు: భార్య.. భర్త.. ఓ ప్రియురాలు

వివాహితుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలిగిరిలో జరిగింది. ఏపినాపి గ్రామానికి చెందిన విష్ణువర్ధన్కు సరితతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కాగా ఇటుకబట్టీల వద్ద పనిచేసే క్రమంలో ధనలక్ష్మితో పరిచయమై వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో వీరు ప్రకాశం(D) పామూరులో ఉన్నారని తెలియడంతో సరిత తన భర్తను కలిగిరికి తీసుకొచ్చింది. ప్రియురాలిని దూరం చేశారంటూ విష్ణువర్ధన్ ఆత్మహత్యకు యత్నించగా భార్య ఆసుపత్రిలో చేర్చింది.
News November 22, 2025
నెల్లూరు జిల్లాలో MROల బదిలీలు

☞ కలువాయి MRO పీవీ కృష్ణారెడ్డి ☞జలదంకి MROగా S.సీతామహాలక్ష్మి
☞ఇందుకూరుపేట MROగా B.మురళీ బదిలీ అయ్యారు.
☞ మరికొందరు DTలను బదిలీ చేశారు.
☞ చేజర్ల MROగా ఆర్.మస్తానయ్య ☞ బుచ్చిరెడ్డిపాలెం DTగా జి.మల్లికార్జున
☞ఆత్మకూరు ఎలక్షన్ DTగా భాగ్యలక్ష్మి, ☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో DTగా S.విజయభాస్కర్ ☞ ఉదయగిరి MLC పాయింట్ కే శ్రీనును బదిలీలు చేశారు.


