News May 10, 2024

మనుబోలు జాతీయరహదారిపై ప్రమాదం

image

మనుబోలులోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేగంగా వెళుతున్న ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.   

Similar News

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. 16వ స్థానంలో మంత్రి ఆనం

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నెల్లూరు జిల్లా నుంచి మంత్రి ఆనం 16వ స్థానంలో నిలిచారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

News February 6, 2025

కందుకూరు YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..

image

కందుకూరు నియోజకవర్గ YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. యువజన విభాగం: మద్దసాని నవీన్ కృష్ణ, మహిళా విభాగం: Tఆదిలక్ష్మి, రైతు విభాగం: N చంద్రమౌళి, లీగల్ సెల్: కొత్తూరి హరికోటేశ్వరరావు, SCసెల్: దగ్గుమాటి కోటయ్య, STసెల్: చేవూరి శ్రీనివాసమూర్తి, గ్రీవెన్స్ సెల్: Yనాగభూషణం, మున్సిపల్ వింగ్: పిడికిటి శంకర్, బూత్ కమిటీస్: కోడూరి వసంతరావు తదితరులు నియమితులయ్యారు.

News February 6, 2025

కావలి DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

image

కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన గుండె మడుగుల బెనర్జీ, ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన కీర్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు కావలిలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు నుంచి ప్రాణహాని ఉందని గ్రహించి కావలి డీఎస్పీ శ్రీధర్‌ను ఆశ్రయించారు.

error: Content is protected !!