News January 13, 2025
మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

మనుబోలు మండలం, కాగితాలపూరు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 1, 2025
జగన్ పర్యటనకు గంజాయి బ్యాచ్ని తెచ్చారు: కోటంరెడ్డి

ఇటీవల జగన్ నెల్లూరుకు వచ్చినప్పుడు కామాక్షమ్మ వందలాది మంది గంజాయి బ్యాచ్ని తీసుకువచ్చింది నిజమా? కాదా? అని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ‘పెంచలయ్య మరణానికి నేను, నా తమ్ముడు, కార్పొరేటర్ శ్రీనివాసులు కారణమని సీపీఎం చెబితే ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. కామాక్షమ్మ నుంచి ఆనం విజయకుమార్ రెడ్డి రూ.5లక్షలు తీసుకున్నారనే ప్రచారం ఉంది’ అని ఆయన చెప్పారు.
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.


