News January 13, 2025

మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

మనుబోలు మండలం, కాగితాలపూరు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 16, 2025

నెల్లూరు: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

image

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కే.సుమన్, సహాధ్యక్షులు సంపత్ కుమార్ కోరారు. నెల్లూరు జిల్లాలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహీధర్ బాబు, జిల్లా జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి పేట రాజేశ్ పాల్గొన్నారు.

News February 16, 2025

జగన్ 2.O పాలనలో అందరి లెక్కలు తేలుస్తా: కాకాణి

image

జగన్ 2.O ప్రభుత్వం రాగానే అతిగా ప్రవర్తించే వారందరి లెక్కలు తేల్చుతామని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. పొదలకూరు(M) బిరుదవోలులో శనివారం ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కాకాణి హామీ ఇచ్చారు.

News February 16, 2025

నెల్లూరు: ఇంటర్ విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమైనట్లు ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బోర్డు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని ఎగ్జామినర్ చీఫ్ అడిషనల్ సూపర్డెంట్‌‌ను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విద్యార్థులను ఇబ్బంది పెడితే ఆ కళాశాలపై చర్యలు తప్పవన్నారు.

error: Content is protected !!