News January 31, 2025

మనూర్: ఎడ్ల బండి కింద పడి వ్యక్తి మృతి

image

మనూర్ మండలం బాదల్ గావ్ శివారులో ఎడ్ల బండి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మత్లి తండాకు చెందిన చౌహాన్(40) కుటుంబంతో కలిసి చెరుకు నరికే పనులకు వచ్చాడు. చెరకు తరలిస్తున్న క్రమంలో ప్రమాద వశాత్తు ఎడ్ల బండి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 23, 2025

ములుగు: పార్టీకి చెప్పే లొంగిపోయాం: ఆజాద్

image

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడె వాసి, మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య@ఆజాద్ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీలో దామోదర్, వెంకన్న ఇద్దరు పార్టీలో కీలకంగా ఉన్నారన్నారు. వారు సైతం లొంగిపోవాలని ఆయన కోరారు. కాగా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, పార్టీకి చెప్పే తాము లొంగిపోయామని ఆజాద్ పేర్కొన్నారు.

News November 23, 2025

GWL: హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యం: ఎస్పీ

image

హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యమని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించారు. పోలీస్ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించే హోంగార్డులకు అనారోగ్యం ఎదురైనప్పుడు ఆరోగ్య బీమా రక్షణ కవచంలా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ బీమా తీసుకొని భద్రతను పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు.

News November 23, 2025

GWL: హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యం: ఎస్పీ

image

హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యమని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించారు. పోలీస్ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించే హోంగార్డులకు అనారోగ్యం ఎదురైనప్పుడు ఆరోగ్య బీమా రక్షణ కవచంలా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ బీమా తీసుకొని భద్రతను పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు.