News January 31, 2025
మనూర్: ఎడ్ల బండి కింద పడి వ్యక్తి మృతి

మనూర్ మండలం బాదల్ గావ్ శివారులో ఎడ్ల బండి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మత్లి తండాకు చెందిన చౌహాన్(40) కుటుంబంతో కలిసి చెరుకు నరికే పనులకు వచ్చాడు. చెరకు తరలిస్తున్న క్రమంలో ప్రమాద వశాత్తు ఎడ్ల బండి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
ఉక్రెయిన్ కనీస కృతజ్ఞత చూపట్లేదు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ వార్ ఆపేందుకు US ప్రయత్నిస్తున్నప్పటికీ ‘కీవ్’ కనీస కృతజ్ఞత చూపట్లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా నుంచి యూరప్ ఆయిల్ కొంటూనే ఉందని మండిపడ్డారు. US, ఉక్రెయిన్లో బలమైన నాయకత్వం ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదంటూ జెలెన్స్కీ, బైడెన్లను SMలో విమర్శించారు. అయితే US చేస్తున్న కృషిపై కృతజ్ఞత ఉందని జెలెన్స్కీ తెలిపారు. కాగా ట్రంప్ <<18354785>>‘పీస్ ప్లాన్’పై<<>> చర్చలు కొనసాగుతున్నాయి.
News November 24, 2025
విశాఖ: ప్రియరాలితో వాగ్వాదం.. ప్రియుడి ఆత్మహత్య

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో నిన్న రాత్రి వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన రాజేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. వ్యాన్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 24, 2025
GNT: అన్నదాతల ఇంటికే ప్రభుత్వం- ‘రైతన్న మీకోసం’ ఆరంభం

గుంటూరు జిల్లాలో రైతుల కష్టాన్ని అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. రైతన్నా.. మీకోసం పేరుతో అధికారులు సోమవారం నుంచి నేరుగా రైతుల ఇళ్లను సందర్శించనున్నారు. పథకాలు ఎలా అందుతున్నాయి, ఎక్కడ జాప్యం ఉందో తెలుసుకుంటారు. పంచసూత్రాలు, యాంత్రీకరణ, సాంకేతిక పద్ధతులపై అవగాహన ఇస్తారు. రూ.14,000 పెట్టుబడి సహాయం అందించిన తర్వాత, ఇది మరో పెద్ద అడుగు అని అధికారులు చెబుతున్నారు.


