News January 20, 2025

మనోహరాబాద్: మృతుడిని గుర్తించేందుకు ప్రయత్నం

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని పాత బావిలో కుళ్లిపోయిన వ్యక్తి శవం లభ్యమైంది. శవాన్ని గుర్తించేందుకు విచారణ చేస్తున్నట్లు మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ రోడ్డులో పాత బావిలో శవాన్ని గుర్తించినట్లు వివరించారు. కుళ్లిపోయిన శవాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని తూప్రాన్ మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 8, 2025

మెదక్: పక్కడ్బందీగా ప్రత్యేక తరగతులు: డీఈవో

image

మెదక్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలని డీఈవో రాధా కిషన్ ఆదేశించారు. ఉదయం 8:15 నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. సాయంత్రం అల్పాహారం అందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 8, 2025

మెదక్: కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తి అరెస్టు

image

భార్య, బామ్మార్దిని కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేగోడ్ ఎస్ఐ పోచయ్య తెలిపారు. రేగోడ్‌కు చెందిన ద్యారంగుల వెంకయ్య ఈ నెల 3న భార్యతో గోడవపడ్డాడు. ఈ ఘటనలో భార్య నాగమణి, బావ మరిది గురువయ్యను వెంకయ్య కత్తితో పొడిచి పారిపోయాడు. గాయపడిన ఇద్దరిని సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు వెంకయ్యను శుక్రవారం అరెస్టు చేసి రిమండ్ తరలించిన పోలీసులు తెలిపారు.

News February 8, 2025

మెదక్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 320 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన యువ అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు.

error: Content is protected !!