News April 15, 2025
మనోహరాబాద్: యువతి అదృశ్యం..!

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ‘కాళ్లకల్కు చెందిన మన్నె నాగలక్ష్మి (19) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అత్వెల్లి వద్దగల నేషనల్ మార్ట్లో పనిచేసేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి ఇంటికి రాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని’ చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
Similar News
News November 23, 2025
ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
News November 23, 2025
ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
News November 23, 2025
వాహనదారులకు అలర్ట్.. ఓవర్లోడ్తో పట్టుబడితే..

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆకస్మిక తనిఖీల కోసం 33 జిల్లా, 3 రాష్ట్ర స్థాయి స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. గత 10రోజుల్లో 4,748 కేసులు నమోదవగా, 3,420 వాహనాలు సీజ్ చేశారు. ఓవర్లోడ్తో వెళ్తూ తొలిసారి పట్టుబడితే వెహికల్ సీజ్ చేస్తారు. రెండో సారి పర్మిట్, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇకపై లైసెన్స్ రెన్యువల్ టైంలో భారీ వాహనాల డ్రైవర్లకు రీఫ్రెషర్ ట్రైనింగ్ ఉంటుంది.


