News April 15, 2025
మనోహరాబాద్: యువతి అదృశ్యం..!

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ‘కాళ్లకల్కు చెందిన మన్నె నాగలక్ష్మి (19) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అత్వెల్లి వద్దగల నేషనల్ మార్ట్లో పనిచేసేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి ఇంటికి రాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని’ చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
Similar News
News November 23, 2025
రేపటి నుంచి అంతర్ జిల్లాల ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం

AP పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న 69వ అంతర్ జిల్లాల SGF-17 బాల బాలికల ఫెన్సింగ్ టోర్నమెంట్ సోమవారం నుంచి ఈనెల 26 వరకు సఖినేటిపల్లి మండలం మోరిలోని జాన సుబ్బమ్మ మెమోరియల్ హైస్కూల్ వద్ద నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు కిషోర్ కుమార్, యం.వేంకటేశ్వరరావు ఆదివారం వివరాలు వెల్లడించారు. 3 రోజులు ఈ ఈవెంట్కు ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు హైస్కూల్ GHM శ్రీధర్ కృష్ణ తెలిపారు.
News November 23, 2025
తంబళ్లపల్లె టీడీపీలో కలవరం?

తంబళ్లపల్లె టీడీపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు నాయకులు, కార్యకర్తలను కలవరపెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో TDP అభ్యర్థి జయచంద్రా రెడ్డి ఓటమి చెందగా.. ములకలచెరువు కల్తీ మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ 2 నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. ఇక బుధవారం అంగళ్లులో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల వర్గపోరు బాహాటమైంది.
News November 23, 2025
సర్పంచి ఎన్నికలు.. UPDATE

TG: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ రిజర్వేషన్ల జాబితాను జిల్లాల కలెక్టర్లకు పంపిస్తోంది. సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. జనాభా నిష్పత్తిని బట్టి SC, ఎస్టీ, బీసీ స్థానాలను కేటాయించినట్లు సమాచారం. కాగా బీసీలకు 22%తో కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.


