News December 27, 2024

మన్మోహన్ సింగ్‌తో జ్ఞాపకాన్ని పంచుకున్న మాజీ మంత్రి

image

భారతదేశ ఆర్థిక సంస్కరణలకు దూరదృష్టి గల నాయకుడు మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలు తరతరాలు గుర్తుండి పోతాయన్నారు. గతంలో వారితో కలిసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి పంచుకున్నారు.

Similar News

News January 9, 2026

కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News January 9, 2026

కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News January 9, 2026

KNR: ‘​యూరియా నిల్వలు పుష్కలం..: ఆందోళన వద్దు’

image

కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత పది రోజుల్లోనే వివిధ సొసైటీల ద్వారా 6,513 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 1,833 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరానికి తగినట్లుగా ఎరువులను తెప్పిస్తున్నామని, రైతులు తమ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.