News February 10, 2025

మన్యంకొండ బ్రహ్మోత్సవాలు.. స్వామివారి హంస వాహన సేవ

image

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై వివరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

Similar News

News April 15, 2026

సిరిసిల్ల: వృద్ధురాలి దారుణ హత్య

image

వృద్ధురాలు దారుణ హత్యకు గురైన ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది. రాజీవ్ నగర్‌కు చెందిన కోన లక్ష్మమ్మ (75) ఒంటరిగా నివసిస్తుంది. మంగళవారం ఉదయం చిన్న కుమారుడు వెంకటేశ్ తల్లి వద్దకు వచ్చేసరికి ఆమె రక్తం మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, సీఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 15, 2026

విమానంలో మహిళపై రేప్.. భారతీయ ప్రయాణికుడిపై ఆరోపణలు

image

సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తున్న విమానంలో పక్కనే కూర్చున్న మహిళపై సుధీర్ కుమార్ (52) అనే భారతీయుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన స్కూట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది బాధితురాలిని మరో సీటుకు మార్చినట్లు పేర్కొన్నారు. ఫ్లైట్ ల్యాండ్ అవగానే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా అక్కడి చట్టాల ప్రకారం గరిష్ఠంగా 12ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

News April 14, 2026

విద్యార్థులు, తల్లిదండ్రులకు జిల్లా ఇంటర్ RIO కీలక సూచనలు

image

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని జిల్లా ఇంటర్ RIO అధికారి వరప్రసాదరావు సూచించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి అవమానాలకు లోను కాకుండా ధైర్యంగా తదుపరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.