News February 10, 2025

మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

image

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

Similar News

News November 28, 2025

సిరిసిల్ల: ఉపాధ్యాయురాలిగా మారిన కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్లలో జరిగిన ఇన్స్పైర్, విద్యా వైజ్ఞానిక సదస్సులో ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులతో మమేకమయ్యారు. సౌర విద్యుత్, పవన విద్యుత్, థర్మో డైనమిక్స్, కిరణజన్య సంయోగ క్రియ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన వచ్చేందుకు ఎగ్జిబిషన్లు దోహదపడతాయన్నారు.

News November 28, 2025

సాలూరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు: ఎస్పీ

image

మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను, మంత్రి అనధికార పీఏ, ఆర్థికంగా దోచుకొని, వేధింపులకు గురిచేశారని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు అతనిపై సాలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. విచారణ జరిపి చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.

News November 28, 2025

నిజామాబాద్: నామినేషన్ అభ్యర్థలకు కొత్త బ్యాంక్ అకౌంట్ కష్టాలు

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యులు నామినేషన్ పత్రాలతో జీరో అకౌంట్ బ్యాంక్ ఖాతాను జతచేయాలని అధికారులు నిబంధనలు జారీ చేశారు. ఈ సమాచారం తెలియని అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కాగా అభ్యర్ధులకు జీరో అకౌంట్ ఖాతాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. కొత్త నిబంధన వల్ల అభ్యర్ధులు బ్యాంక్‌లకు క్యూ కడుతున్నారు.