News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News January 1, 2026
VJA: నూతన సంవత్సర వేడుకల బందోబస్తు పర్యవేక్షించిన సీపీ

నూతన సంవత్సర వేడుకల బందోబస్తును విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు స్వయంగా పర్యవేక్షించారు. అర్ధరాత్రి నుంచి విధుల్లో ఉన్న ఆయన, ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద కేక్ కట్ చేసి పోలీస్ అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో
డీసీపీలు కృష్ణ కాంత్ పటేల్, షరీనా బేగం, ఎస్.వి.డి. ప్రసాద్, డీసీపీలు, ఏసీపీలు, అధికారులు పాల్గొన్నారు.
News January 1, 2026
HYDలో బిర్యానీ తిని ఒకరి మృతి.. 15మంది సీరియస్

న్యూ ఇయర్ వేడుక విషాదం మిగిల్చింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట PS పరిధిలోని భవానినగర్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) మృతి చెందగా మరో 15 మంది సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 1, 2026
మినుములో మారుకా మచ్చల పురుగు నివారణ (2/2)

☛ పంటలో గూళ్లు గమనిస్తే ఎసిఫేట్ 1.0 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 2.0 ml. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీలలో ఏదో ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ మారుకా మచ్చల పురుగు ఉద్ధృతి అధికంగా ఉంటే స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా రైనాక్సిపిర్ 0.3 మి.లీ (లేదా) ప్లుబెండిఎమైడ్ 0.2 మిల్లీలీటరును ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


