News February 20, 2025
మన్యంకొండ హుండీ ఆదాయం రూ.32,39,301

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.
Similar News
News December 30, 2025
T20 WCకు ఇంగ్లండ్ టీమ్.. హిట్టర్కు నో ఛాన్స్

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న T20 WCనకు ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ కెప్టెన్గా 16 మందితో టీమ్ను అనౌన్స్ చేసింది. హిట్టర్ లివింగ్స్టోన్కు జట్టులో చోటు దక్కలేదు.
టీమ్: హ్యారీ బ్రూక్(C), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, కార్సే, సామ్ కరన్, లియం డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జెమీ ఓవర్టన్, రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
News December 30, 2025
ఇష్టారాజ్యంగా ఛార్జీల వసూళ్లు.. కలెక్టర్ సీరియస్

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తుల వద్ద అద్దె గదుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. జాతర సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని అదనంగా వసూలు చేయకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక కమిటీ వేస్తామని RDO రాధాబాయి ఈ సందర్భంగా అన్నారు.
News December 30, 2025
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 31 రాత్రి జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై వేడుకలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు.


