News February 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.32,39,301

image

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.

Similar News

News November 27, 2025

కృష్ణా నదీ జలాలపై హక్కులను వదులుకోం: సీఎం

image

AP: కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను వదులుకునేది లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని జలవనరుల శాఖ అధికారుల సమీక్షలో దిశానిర్దేశం చేశారు. నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులకు వీలులేదని, చట్టపరంగా దక్కిన వాటాను కొనసాగించాల్సిందేనని చెప్పారు. ఏటా వేలాది <<16807228>>TMC<<>>ల జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరించాలన్నారు.

News November 27, 2025

KTDM: పోలీస్ స్టేషన్‌లో ఒక్కటైన ‘మూగ’ జంట

image

ప్రేమకు మాటలు అక్కర్లేదని నిరూపిస్తూ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ వేదికగా మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతున్న ఓ జంట ఒక్కటయ్యింది. పెళ్లి కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, పోలీసులు ఇరు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు. చివరకు పోలీసుల సమక్షంలోనే ఆ జంట దండలు మార్చుకుంది. అక్కడ పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసేవారిలా కాకుండా, మనసున్న మారాజులుగా వ్యవహరించారు.

News November 27, 2025

VKB: ఈ గ్రామంలో ఒకే ఇంటికే పల్లె పగ్గాలు!

image

బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్‌లో పంచాయతీ రిజర్వేషన్లు ఓ కుటుంబానికే వరంగా మారాయి. గ్రామంలో సర్పంచ్ (ఎస్టీ జనరల్)తో పాటు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ వార్డులు రిజర్వ్ కావడంతో గ్రామంలో ఉన్న ఒక్క ఎస్టీ కుటుంబం ఎరుకలి భీమప్ప కుటుంబం మొత్తం పోటీ రంగంలో నిలబోనుంది. గ్రామంలో 494 ఓటర్లు, 8 వార్డులు ఉండగా, ఎస్టీ వర్గానికి చెందిన భీమప్ప కుటుంబం ఒక్కటే ఉండటంతో మూడు స్థానాలకు అదే ఇంటి నుంచే అభ్యర్థులు రావడం ఖాయం.