News February 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.32,39,301

image

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.

Similar News

News March 20, 2025

ధోనీయా మజాకా… యాడ్ వీడియో భారీ సక్సెస్

image

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన <<15801433>>యాడ్<<>> భారీ విజయం పొందిందని సదరు ఈ-సైకిల్ కంపెనీ సీఈవో కునాల్ గుప్తా ట్వీట్ చేశారు. కేవలం 24 గంటల్లోనే యాడ్ వీడియోకు 50 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇది మాస్టర్ స్ట్రోక్ అని, వ్యూస్ పెరుగుతుండటం చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ లుక్‌లో తలా నటించిన విషయం తెలిసిందే.

News March 20, 2025

వరల్డ్ బెస్ట్ బ్రెడ్ మన ఇండియాదే!

image

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ మార్చి-2025 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో భారతదేశపు ‘బటర్ గార్లిక్ నాన్’ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రెడ్‌గా నిలిచింది. ఇది 4.7 రేటింగ్‌తో ప్రథమ ర్యాంకును పొందింది. ఆ తర్వాత అమృత్‌సర్‌కు చెందిన ‘కుల్చా’కు రెండు, పరోటాకు ఆరో స్థానం లభించింది. కాగా, 8వ ర్యాంకులో ‘నాన్’, 18లో ‘పరాఠా’, 26లో ‘భతురా’, 28లో ‘ఆలూ నాన్’, 35 ర్యాంకులో ‘రోటీ’ ఉన్నాయి.

News March 20, 2025

పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ప్రతీక్

image

పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి డీఈవో రేణుక దేవితో కలిసి కలెక్టర్ పరీక్షల నిర్వహణ అధికారులతో తహసీల్దారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎలాంటి మాస్ కాఫింగు అవకాశం లేకుండా చూడాలన్నారు.

error: Content is protected !!