News March 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.35.26 లక్షలు

image

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత బుధవారం 2వసారి హుండీ లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన సొమ్ము మొత్తం రూ.35,26,085 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈవో శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్ మదనేశ్వర్, సూపరింటెండెంట్ నిత్యానంద చారి, IDBC మేనేజర్ నీలకంఠ పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

సిద్దిపేట: కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లు.. ఉచిత చేప పిల్లలు: హరీశ్ రావు

image

కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లు ఉచిత చేప పిల్లలు అందాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన గంగా భవాని ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట ఫిష్ మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించామమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సిద్దిపేట ఫిష్ మార్కెట్‌ను చూసి నేర్చుకునేలా అభివృద్ధి చేశామన్నారు. గంగా భవానీ అమ్మవారి దయతో అందరికి అన్నింటా శుభం చేకూరాలన్నారు.

News December 5, 2025

ఏలూరు: BSNL టవర్లపై MP పుట్టా మహేష్ వినతి

image

ఏలూరు పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న BSNL మొబైల్ టవర్లను ఏర్పాటుచేయాలని MP పుట్టా మహేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో మంత్రిని కలిసిన ఎంపీ.. గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్‌వర్క్ సౌకర్యం లేకపోవడంతో ఈ-గవర్నెన్స్, బ్యాంకింగ్ సేవలు, ఇతర ప్రజా సేవలందించే కార్యక్రమాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు MP తెలిపారు.

News December 5, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పెంపు

image

సంగారెడ్డి జిల్లాలోని ఆసక్తి గల అభ్యర్థులు ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు గడువును డిసెంబర్ 7వరకు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.