News March 19, 2024
మన్యం: ‘గోడలపై రాతలకు అనుమతి లేదు’

ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడలపై రాతలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల అంశాలపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లో, వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని ఆయన ఆదేశించారు.
Similar News
News November 12, 2025
VZM: ‘రుణాల రికవరీ వందశాతం ఉండాలి’

రుణాల రికవరీ వందశాతం ఉండాలని DRDA పీడీ శ్రీనివాస్ పాణి ఆదేశించారు. స్థానిక DRDA కార్యాలయంలో ‘మన డబ్బులు.. మన లెక్కలు’ కార్యక్రమంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. రుణాల లక్ష్యాన్ని సిబ్బంది చేరుకోవాలని కోరారు. గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో APD సావిత్రి, DPMలు చిరంజీవి, లక్ష్మీ నాయుడు పాల్గొన్నారు.
News November 12, 2025
VZM: నేడు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నిరసన కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నేడు వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేపడుతున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల వరకు ర్యాలీలు కొనసాగనున్నాయని తెలిపింది.
News November 12, 2025
VZM: నేడు PMAY గృహ ప్రవేశాలు

విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 8,793 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం జరగనుందని హౌసింగ్ పీడీ మురళీ తెలిపారు. బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయనున్నారు. రాజాం, నెల్లిమర్ల, బొబ్బిలి, ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా గృహప్రవేశాలు జరుగనున్నాయి.


