News October 21, 2024

మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర!

image

KNR మొదట 1905లోనే జిల్లాగా ఏర్పడింది. గతంలో భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రంగా విలీనమైన తర్వాత 1948లో కరీంనగర్ జిల్లాగా భాగమైంది. తెలుగు మాట్లాడే పేరొందిన క్రమంలో 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు. 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాగా ఏర్పడింది. కాగా, నిజాంపాలనలో(1724-1948)అసఫ్ జాహి రాజవంశీయుల ఆధీనంలో ఉంది.1937లో షైఖాన్ బిన్ షైక్ సాలేహ్ కరీంనగర్ కమాన్ నిర్మించారు.

Similar News

News October 1, 2025

KNR: ‘నర్సరీలోని మొక్కలను సంరక్షించాలి’

image

నగరపాలిక ఆధ్వర్యంలో ఎల్ఎండీ సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. మొక్కలు ఎండిపోకుండా నీటిని అందిస్తూ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నర్సరీలో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి శుభ్రం చేయాలన్నారు. రోడ్డు డివైడర్ల మధ్యలో మొక్కలు నాటించాలని సూచించారు.

News October 1, 2025

డీఎస్పీగా మహేశ్వరి.. సీపీ గౌస్ ఆలం అభినందన

image

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలానికి చెందిన మోదుంపల్లి మహేశ్వరీ గ్రూప్-1 ఫలితాల్లో 474వ ర్యాంకు సాధించి డీఎస్పీ ఉద్యోగాన్ని దక్కించుకుంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో చదివిన ఆమె విజయంపై కరీంనగర్ సీపీ గౌస్ అలాం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేశ్వరీ విజయం గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలిచింది.

News October 1, 2025

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో BJP స్టేట్ చీఫ్ పూజలు

image

ప్రసిద్ధి చెందిన కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి దేవాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఉన్నారు.