News November 12, 2024
మన చిత్తూరు జిల్లాకు బడ్జెట్లో వచ్చింది ఎంతంటే?

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. (కోట్లలో)
➤హంద్రీ-నీవాకు రూ.2014.23
➤తిరుపతి కార్పొరేషన్కు రూ.350
➤తెలుగుగంగ ప్రాజెక్టు పనులకు రూ.879.24
➤గాలేరు నగరికి రూ.2438.94
➤SVUకి రూ.226.38
➤వెటర్నరీ వర్సిటీకి రూ. 153
➤పద్మావతి వర్సిటీకి రూ.72.73
➤ ద్రవిడ వర్సిటీకి రూ.27.91
➤శ్రీసిటీ ఐఐటీకి రూ.19.52
Similar News
News November 28, 2025
చిత్తూరు: సివిల్స్ ఎగ్జామ్కు ఫ్రీ ట్రైనింగ్

యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. సివిల్స్ ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
News November 28, 2025
BLOల నియామకానికి ప్రతిపాదనలు: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోల నియామకానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. బీఎల్ఓలందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు.
News November 27, 2025
అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు విధిగా పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొనాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సర్వే జరుగుతోందని, ప్రతి ఒక్క అధికారి రైతుల ఇళ్లకు వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.


