News February 24, 2025
మన వికారాబాద్ జిల్లా నేటి కార్యక్రమాలు

√ నేటితో ముగియనున్న పోలేపల్లి ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు.√ కొడంగల్లో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం.√ నేడు జిల్లాలోని రైతులకు పీఎం కిసాన్ నిధులు జమ.√ పరిగి: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం.√ నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో గీతా యజ్ఞ పారాయణం.√ తాండూరు: నేడు పల్లెగడ్డ హనుమాన్ దేవాలయం వద్ద లింగస్థాపన.√ నేడు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యేలు.
Similar News
News November 21, 2025
నిజాంసాగర్: నవోదయ 6వ తరగతి అడ్మిట్ కార్డులు విడుదల

నిజాంసాగర్ జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల అయినట్లు ప్రిన్సిపల్ సీతారామ్ శుక్రవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష DEC 13న నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
News November 21, 2025
ఎన్కౌంటర్లపై మావోయిస్టుల లేఖ

వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథలు అల్లారని ఆరోపించింది. చికిత్స కోసం వచ్చిన <<18318593>>HIDMA<<>>ను ఎన్కౌంటర్ చేశారని మండిపడింది. నిరాయుధులుగా ఉన్నవారిని హత్య చేశారంది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.


