News March 10, 2025
‘మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందాం’

వికారాబాద్ జిల్లా తాండూరు పరిధి యాలాల్ మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ, శివకుమార్ దంపతుల 9 నెలల బాబు వశిష్ఠ ‘బైలేరియా అట్రే సై’ అనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్సకు రూ.22 లక్షలు అవసరమని చెప్పడంతో <<15707873>>దాతల కోసం<<>> తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కాగా మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందామని ఇప్పటికే కాంగ్రెస్ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
Similar News
News March 21, 2025
తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 8,627 మంది విద్యార్థులకు గాను మొదటి రోజు 8,616 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 11 మంది గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
News March 21, 2025
VIRAL: ప్లీజ్.. ఇది OYO కాదు.. క్యాబ్!!

బెంగళూరులో ఓ డ్రైవర్ తన క్యాబ్లో పెట్టిన పోస్టర్ వైరల్ అవుతోంది. ‘హెచ్చరిక.. రొమాన్స్కు అనుమతి లేదు. ఇది క్యాబ్, ఓయో కాదు..’ అని అతడు రాసుకొచ్చాడు. దీంతో తన క్యాబ్లో ఎన్నిసార్లు జంటల పనులతో విసిగి ఇలా చేశాడో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
News March 21, 2025
BREAKING: బీబీనగర్ తహశీల్దార్ సస్పెండ్

బీబీనగర్ తహశీల్దార్పై సస్పన్షన్ వేటు పడింది. పడమటిసోమారం గ్రామంలో ఖాళీ స్థలానికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ జారీ చేయడంతో తహశీల్దార్ శ్రీధర్ను సస్పెండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.