News April 11, 2025
మరికల్: ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ కార్యాలయాల తరలింపు ముహూర్తం ఫిక్స్

మరికల్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలతో పలు కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ మండల్ కాంప్లెక్స్కు శనివారం తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 21న ప్రారంభించిన మండల కాంప్లెక్స్ ఇండికేటర్ కార్యాలయంలో నీటి సమస్య ఏర్పడడంతో కార్యాలయాల తరలింపు బ్రేక్ పడింది. ఇట్టి కార్యాలయాలల్లో శుక్రవారం నూతన బోరును వేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 17, 2025
మావోయిస్టు పార్టీ లేఖపై అనుమానాలు!

ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రిలీజైన లేఖపై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇప్పటి వరకు ఇలా సంతకం, ఫొటోతో లేఖ రిలీజ్ కాలేదు. AUG 15వ తేదీ అని ఉంది. మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేస్తామనే ప్రకటన ఇంత సులభంగా ఉండదు. దానికి దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ ఉంటుంది’ అని చెబుతున్నారు. మరోవైపు ఈ లేఖను వెరిఫై చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News September 17, 2025
తిరుగుబాటుకు తొలి అడుగు వీర బైరాన్పల్లి

రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి, తిరుగుబాటును ప్రారంభించిన తొలి గ్రామం వీర బైరాన్పల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణలో ఇంకా పోరాటం కొనసాగుతున్న ఆ సమయంలో.. పొరుగు గ్రామాలను దోచుకెళుతున్న రజాకార్లను ధైర్యంగా అడ్డుకుంది. 126 మంది వీరుల త్యాగానికి నిదర్శనంగా ఉన్న అమరవీరుల స్తూపం ఇక్కడ నెలకొంది.
News September 17, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,11,710కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 పతనమై రూ.1,02,400 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,42,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.