News April 11, 2025
మరికల్: ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ కార్యాలయాల తరలింపు ముహూర్తం ఫిక్స్

మరికల్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలతో పలు కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ మండల్ కాంప్లెక్స్కు శనివారం తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 21న ప్రారంభించిన మండల కాంప్లెక్స్ ఇండికేటర్ కార్యాలయంలో నీటి సమస్య ఏర్పడడంతో కార్యాలయాల తరలింపు బ్రేక్ పడింది. ఇట్టి కార్యాలయాలల్లో శుక్రవారం నూతన బోరును వేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 9, 2025
ముగిసిన ‘అఖండ-2’ వివాదం!

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న రాత్రి ఈరోస్ సంస్థతో 14 రీల్స్కు సానుకూల చర్చలు జరిగాయని తెలిపాయి. ఇవాళ కోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని వెల్లడించాయి. ఈ క్రమంలో 12న విడుదల, 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవాళ ఉ.10.30కు మద్రాస్ కోర్టులో విచారణ జరగనుంది.
News December 9, 2025
రేపు ఉద్యోగులతో పవన్ మాటామంతీ

AP: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ రేపు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలను ఆయన వారికి వివరిస్తారు. అలాగే ఎలాంటి విధానాలు పాటిస్తే గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమో తెలుసుకోనున్నారు. అవినీతిరహిత పాలనను అందించేందుకు సహకరించాలని కోరనున్నారు.
News December 9, 2025
కరీంనగర్: ఉప సర్పంచ్ కుర్చీకి రూ.5- 10 లక్షలు..?

పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి కారణం జాయింట్ చెక్ పవర్ ఉండటమే. ఈ కుర్చీని దక్కించుకోవడానికి ఆశావహులు వార్డు మెంబర్ స్థానంలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో ఈ పదవి కోసం ఏకంగా రూ.5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వార్డు సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి నగదు ఆఫర్లు, రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా ఎన్నికల వేడిని రాజేస్తోంది.


