News February 27, 2025
మరికల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మరికల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పసుపులకి చెందిన కృష్ణయ్యను గూరకొండ దగ్గర బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 18, 2025
HYD: నల్లాబిల్లు కట్టాలని క్రెడిట్కార్డు ఖాళీ చేశాడు!

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో డబ్బు కాజేస్తున్నారు. పెండింగ్ నల్లా బిల్లు చెల్లించాలని ఆన్లైన్ లింక్ పంపి ఓ వ్యక్తి నుంచి రూ.95,237 కాజేశారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీవాసి సంకలమద్ది శ్రీనివాస్ రెడ్డికి SEPT 11న వాటర్ బోర్డుకు బిల్లు చెల్లించాలని 6303323494 నుంచి వాట్సప్ లింక్ పంపాడు. ఈనెల బిల్ చెల్లించలేదని, నిజమేనని నమ్మి APK ఫైల్ ఇన్స్టాల్ చేయగా క్రెడిట్ కార్డు కాళీ అయింది.
News September 18, 2025
NTR: రూ.42 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు సింగ్నగర్కు చెందిన వృద్ధుడిని మోసం చేశారు. ఈ నెల 11న సైబర్ నేరగాళ్లు సత్యనారాయణ మూర్తికి ఫోన్ చేసి భయపెట్టారు. ఈ క్రమంలో అతని బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ.42 లక్షలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.