News October 8, 2024
మరికల్: రూ.11,11,111 నోట్లతో దుర్గామాత అలంకరణ
మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం 6వ రోజు అమ్మవారిని రూ. 11,11,111 కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామస్థులు దుర్గామాతను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News October 8, 2024
బతుకమ్మ సంబరాల్లో గొడవ.. ఆర్మీ జవాన్పై దాడి
ఆర్మీ జవాన్పై కత్తితో ఓ వ్యక్తి దాడి చేయడంతో గాయపడిన ఘటన ధరూర్ (M) రేవులపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామంలోని బతుకమ్మ సంబరాలు జరుగుతుండగా.. కృష్ణ అనే వ్యక్తి సౌండ్ గట్టిగా వస్తుందని బంద్ చేయాలంటూ వాదనకు దిగాడు. వారించడానికి వెళ్లిన ఆర్మీ జవాన్పై కృష్ణ కత్తితో దాడి చేయగా.. జవాన్ తీవ్రంగా గాయపడడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News October 8, 2024
MBNR: ‘పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయండి’
చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్షిప్ రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే సాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి స్కాలర్షిప్లు చెల్లించాలని చెబుతున్నారు.
News October 8, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రతలిలా…
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లి లో 35.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా సోలిపూర్ లో 32.7 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కోటకొండ లో 31.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా కొల్లూరులో 30.0 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రాలో 29.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.