News March 2, 2025
మరికల్: లారీ ఢీకొని మహిళ మృతి

మరికల్ మండల కేంద్రంలో లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. మండల కేంద్రంలో నివాసం ఉంటున్న అనూష(40)ను ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మృతి చెందినట్లు మరికల్ ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు.
Similar News
News December 9, 2025
గాఢ సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

స్థూల సేంద్రియ ఎరువుల కంటే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.
News December 9, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. మంత్రి విచారం వ్యక్తం

నగరి(M) తడుకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి స్పందించారు. ఘటన బాధాకరమని, సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News December 9, 2025
పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్?

వ్యాపారవేత్త రాజ్హిత్ ఇబ్రాన్తో హీరోయిన్ నివేదా పేతురాజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇన్స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్ట్ను తొలగించడం, ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దయింది.


