News January 28, 2025
మరికల్: వేధింపుల కేసులో వ్యక్తికి జైలు శిక్ష

మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయిని కొట్టి వేధించిన కేసులో కన్మనూరుకి చెందిన చింటూ అనే యువకుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20,200 జరిమానా విధిస్తూ జడ్జి వింధ్య నాయక్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2017 సెప్టెంబర్ 13న అమ్మాయి తండ్రి తిమ్మప్ప ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించడంతో జైలు శిక్ష విధించిందని చెప్పారు.
Similar News
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
News December 10, 2025
సిరిసిల్ల జిల్లాలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 12 మండలాల్లోని 260 గ్రామపంచాయతీలకు గాను 27 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 233 సర్పంచ్ స్థానాల్లో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 860 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడతలో 5 మండలాలు, రెండో విడతలో 3 మండలాలు, తుది విడతలో 4 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
News December 10, 2025
SRCL: ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు: SP

ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలుంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో RDOలు వెంకటేశ్వర్లు, రాధా భాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం పాల్గొన్నారు.


