News February 23, 2025

మరికాసేపట్లో తిరుపతికి రానున్న CM 

image

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో రేణిగుంటకు రానున్నారు. 10.55 నిమిషాలకు ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11:10కి తుకివాకంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలుకు చేరుకుంటారు. అక్కడ టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ కుమారుని వివాహానికి హాజరవుతారు. అనంతరం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.

Similar News

News December 24, 2025

NZB: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు NZB జిల్లా గురుకుల పాఠశాలల సీనియర్ ప్రిన్సిపల్ గోపిచంద్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 21లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

News December 24, 2025

తిరుపతి: మహంతిగా అర్జన్ దాస్ తిరిగి వస్తాడా..?

image

తిరుపతిలోని శ్రీహథీరాంజీ మఠం మాజీ మహంతి అర్జున్ దాస్ తిరిగి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆయనపై ఆరోపణల నేపథ్యంలో గతంలో ధార్మిక పరిషత్ ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని పై కోర్టులో కేసు జరుగుతుండగా తాజాగా సుప్రీం కోర్టులో అర్జున్ దాస్ తిరిగి పిటీషన్ దాఖలు చేశారు. ఇది త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

News December 24, 2025

అపరాల పంటల్లో బంగారు తీగ కలుపు నివారణ

image

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.