News June 3, 2024

మరికొన్ని గంటల్లో ఫలితాలు.. శ్రీకాకుళంలో పట్టాభిషేకం ఎవరికో?

image

ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నేతల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌‌తో నేతలతో పాటు బెట్టింగ్ రాయుళ్లలోను తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కౌంటింగ్‌కు చిలకపాలెం సమీపంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మనజీర్ జీలానీ సామూన్ తెలిపారు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

Similar News

News November 17, 2025

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

image

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.

News November 17, 2025

బుడితి: ఈ హాస్పిటల్‌లో ఏం జరుగుతుంది.. గర్భిణుల మృతితో అలజడి

image

అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి.. ఇటీవల కాలంలో ఆ హాస్పిటల్లో గర్భిణులు శస్త్ర చికిత్స అనంతరం మృతి చెందడం కొనసాగుతుంది. దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సారవకోట మండలం బుడితి సీహెచ్సీలో గతంలో ఒకేరోజు ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. తాజాగా శనివారం మరో గర్భిణి మృతి చెందింది. దీనిపై అధికారులు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.

News November 17, 2025

SKLM: ‘కుష్టు వ్యాధిపై సర్వేకు 2,234 బృందాలు నియమించాం’

image

కుష్టు వ్యాధిపై సర్వే‌కు జిల్లా వ్యాప్తంగా 2,234 బృందాలను నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు DMHO డాక్టర్ తాడేల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 17-31 వరకు ఈ వ్యాధిపై ఆశా కార్యకర్త, వాలంటీర్‌లు రోజుకు 20 గృహాల్లో సర్వే నిర్వహిస్తారన్నారు. స్పర్శ లేని మచ్చలను గుర్తించాలని ఆయన వారికి చెప్పారు.