News March 19, 2025

మరిపెడ: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన మరిపెడ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లంపేట గ్రామానికి చెందిన బత్తెం శ్రీను- కళమ్మ దంపతుల పెద్ద కుమారుడు బత్తెం అజయ్(21) గ్రామంలోనే ఉంటూ విద్యుత్ శాఖలో ప్రయివేటు హెల్పర్‌గా మూడేళ్లుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎల్లమ్మ పండగ చేయగా మంగళవారం రాత్రి సమయంలో కరెంట్ వైర్లు సరి చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు చెప్పారు.

Similar News

News November 18, 2025

సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

image

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.

News November 18, 2025

వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

image

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.

News November 18, 2025

హనుమకొండ: భవితశ్రీ చిట్‌ఫండ్ ఎండీ అరెస్ట్

image

భవితశ్రీ చిట్ ఫండ్ ఎండీ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ పరారీలో ఉండగా హనుమకొండ పోలీసులకు చిక్కాడు. కోట్లాది రూపాయలు చిట్టి సభ్యులకు ఎగవేసి, మోసం చేసి పరారీలో ఉన్న శ్రీనివాస్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.