News March 19, 2025

మరిపెడ: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన మరిపెడ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లంపేట గ్రామానికి చెందిన బత్తెం శ్రీను- కళమ్మ దంపతుల పెద్ద కుమారుడు బత్తెం అజయ్(21) గ్రామంలోనే ఉంటూ విద్యుత్ శాఖలో ప్రయివేటు హెల్పర్‌గా మూడేళ్లుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎల్లమ్మ పండగ చేయగా మంగళవారం రాత్రి సమయంలో కరెంట్ వైర్లు సరి చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు చెప్పారు.

Similar News

News December 1, 2025

NTR: రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

image

రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను అమరావతి భూసమీకరణ విధులలో భాగం చేసేందుకు CRDA సన్నద్ధమైంది. CRDAలో డిప్యూటీ కలెక్టర్లు(7), తహశీల్దార్(5), డిప్యూటీ తహశీల్దార్(5) ఉద్యోగాలకు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు DEC 2లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలని, ఇదే వెబ్‌సైట్‌లోని కెరీర్స్ ట్యాబ్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 1, 2025

GNT: ‘HIV పై తప్పక అవగాహన కలిగి ఉండాలి’

image

గుంటూరు జిల్లాలో ప్రజలకు ఉచిత HIV పరీక్షలు, సూచనలు ఇచ్చేందుకు 10 కౌన్సిలింగ్, పరీక్షా కేంద్రాలు (Standalone ICTCs), ప్రభుత్వ ఆసుపత్రులలో, 27 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో , 47 పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేశారు. జిల్లాలో HIVతో జీవిస్తున్న వారికి NTR పెన్షన్ కింద రూ. 4,000 చొప్పున 2,634 మందికి అందిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజలు HIV పై తప్పక అవగాహన కలిగి ఉండాలి.

News December 1, 2025

కృష్ణా జిల్లాలో యధావిధిగానే పాఠశాలలు: డీఈఓ

image

కృష్ణాజిల్లాలో సోమవారం యధావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని డీఈఓ రామారావు తెలిపారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడని కారణంగా పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. భారీ వర్షాలు పడితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర ప్రాంత మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి తహశీల్దార్లు స్కూల్స్ శెలవుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.