News December 9, 2024
మరోసారి ఎంపీగా బీదకు ఛాన్స్..?

కావలికి చెందిన బీద మస్తాన్ రావు వైసీపీ, రాజ్యసభ ఎంపీ పదవికి ఇటీవల రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి రాజ్యసభ ఎంపీగా బీదకే టీడీపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని సమాచారం. రేపు సాయంత్రంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News November 18, 2025
రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
News November 18, 2025
ఢిల్లీలో అవార్డు అందుకున్న నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో 2024-25 సంవత్సరంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్రం అవార్డు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం వర్షాన్ని ఒడిసిపట్టేందుకు జిల్లాలో 3,495 ఇంకుడు గుంతలు, 856 ఫామ్ పాండ్స్తో కలిపి 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేసినందుకు అవార్డు లభించినట్లు సమాచారం.
News November 18, 2025
దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.


