News December 10, 2024

మరోసారి ఘాటెక్కిన కడప రాజకీయం

image

కడపలో రాజకీయం మరోసారి ఘాటెక్కింది. తాగునీటి సమస్య లేకున్నా ఉన్నట్లు MLA మాధవి చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ MLA అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. దీనికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ‘రా వీధుల్లోకి వెళ్లి ప్రజలను అడుగుదాం. ఇలా చెప్తే ప్రజలు గాడిద మీద ఊరేగిస్తారు’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కడపకు వచ్చిన సందర్భంగా MLA నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వివాదం మొదలైంది.

Similar News

News February 5, 2025

సింహాద్రిపురంలో పులి పిల్లలు?

image

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో కలకలం రేగింది. మంగళవారం గ్రామంలో పులి పిల్లలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. రెండు పులి పిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని గ్రామస్థుడు కిషోర్ అన్నారు. మరికొందరు కూడా పొదల్లో పులి పిల్లలు కనిపించాయని తెలిపారు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

News February 5, 2025

కడపలో మహానాడు స్థలాన్ని పరిశీలించిన మంత్రి

image

మే లో కడప వేదికగా నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సవిత జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చైతన్యతో పాటు పలువురు నాయకులతో కలిసి మహానాడు నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఎంతమంది వస్తారు వారికి తగ్గ ఏర్పాట్ల చేసేలా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు వస్తారన్నారు.

News February 4, 2025

నేటి విద్యార్థులే రేపటి పౌరులు: మంత్రి సవిత

image

నేటి విద్యార్థులే రేపటి భవిభారత పౌరులని, విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత అన్నారు. మంగళవారం స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో 37వ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సవిత ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు.

error: Content is protected !!